మైదా పిండి: ఒక కప్పు, ఉల్లిగడ్డలు: రెండు (పెద్దవి), ఆలుగడ్డ: ఒకటి, కలోంజి: పావు టీస్పూన్, కరిగించిన నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఆవాలు, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా: అర టీస్పూన్ చొప్పున, కారం, ధనియాల పొడి: ఒక టీస్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా, వంటసోడా: చిటికెడు.
ఒక గిన్నెలో మైదా, కొంచెం ఉప్పు, నెయ్యి, కలోంజి, వంటసోడా వేసి బాగా కలపాలి. మిశ్రమంలో తగినన్ని నీళ్లుపోసి ముద్దలా చేసి అరగంటపాటు నానబెట్టాలి. ఆలుగడ్డను ఉడకబెట్టి మెత్తగా మెదపాలి. స్టవ్మీద పాన్పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి.. బాగా వేడయ్యాక ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ జోడించి సన్నని మంటపై వేయించాలి. ఉల్లిగడ్డ వేగాక కారం, పసుపు, ధనియాలపొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి చివరగా నిమ్మరసం చల్లి దించేయాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని మందంగా పూరీల్లా ఒత్తి మధ్యలో ఉల్లిగడ్డ మిశ్రమం పెట్టి అంచుల్ని మూసేసి గుండ్రంగా అని అరచేతిలో వేసి ఒకసారి నొక్కాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక అప్పటికే చేసి పెట్టుకున్న కచోరీలను వేసి తక్కువ మంటపై నిదానంగా కాల్చుకుంటే.. కచోరీలు సిద్ధం.
Bread Pakora Recipe | బ్రెడ్ పకోడీ తయారీ విధానం