మైదా పిండి: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, కుంకుమ పువ్వు: చిటికెడు, వంటసోడా: అర టీస్పూన్, పెరుగు: పావుకప్పు, ఉప్పు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, వంటసోడా వేసి బాగా కలపాలి. మైదా, కరిగించిన వేడి నెయ్యి జోడించి కలగలిపి తగినన్ని నీళ్లుపోసి ముద్దలా చేసి అరగంటపాటు నానబెట్టాలి. స్టవ్మీద పాన్పెట్టి చక్కెర, అర కప్పు నీళ్లు పోసి, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి ముదురుపాకం పట్టుకోవాలి. పిండిని మరోసారి బాగా మెదిపి చిన్నచిన్న ముద్దలు చేసుకుని మధ్యలో బొటనవేలితో నొక్కి బాదుషాలు చేసుకోవాలి. వాటిని తక్కువ మంటపై నూనెలో దోరగా వేయించి చక్కెర పాకంలో వేయాలి. అయిదు నిమిషాలు నానిన తర్వాత తీస్తే, నోరూరించే చిట్టిపొట్టి బటన్ బాదుషా సిద్ధం.
Egg Manchurian Recipe | ఎగ్మంచూరియా తయారీ విధానం