మైదా: ఒకకప్పు, పనీర్ తురుము: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
ఒక గిన్నెలో మైదా, రెండు టేబుల్ స్పూన్ల నూనె, చిటికెడు ఉప్పు వేసుకుని తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పాలిథిన్ కవర్లో పెట్టి గంటపాటు నాననివ్వాలి. స్టవ్మీద పాన్పెట్టి కొద్దిగా నూనెవేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాలి. పనీర్ తురుము, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించి దించి చల్లార్చుకోవాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చపాతీల్లా ఒత్తుకుని పెనంపై వేసి ఒకసారి రెండు వైపులా తిప్పి తీసేయాలి. ఇప్పుడు
చపాతీని నిలువుగా కట్చేసి మధ్యలో పనీర్ మిశ్రమం పెట్టి సమోసాలు చుట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక సమోసాలు వేసి దోరగా కాల్చుకుంటే వేడివేడి పనీర్ సమోసా సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Popcorn | పాప్కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
నోరూరించే హలీమ్ లడ్డూలు.. కావాల్సినప్పుడు వేడి చేసుకుని లాగించేయడమే!!
millet upma recipe | జొన్న ఉప్మా తయారీ విధానం