కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఇప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ముఖ్యంగా ఇందులో దర్శకులు ఎక్కువగా మరణిస్తూ ఉండడం విషాదం. టాలీవుడ్ లోని దాదాపు అరడజను మంది కుర్ర దర్శకులు ఈ మాయదారి వైరస్ బారినపడి కన్నుమూశారు. అందరూ వయసులో చాలా చిన్న వాళ్లు కావడం గమనార్హం. కేవలం ఒకటి రెండు సినిమాలు చేసి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న వాళ్లను నిర్దాక్షిణ్యంగా కాటేసింది కరోనా వైరస్. తాజాగా మరో దర్శకుడు కూడా ఇలాగే కన్నుమూసాడు. కేవలం 42 ఏళ్ల వయసులో నంద్యాల రవి వైరస్ తో పోరాడి ఓడిపోయాడు.
గతంలో నాగశౌర్య, అవికా గోర్ జంటగా వచ్చిన లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాను తెరకెక్కించాడు . అంతకు ముందు నేను సీతామాలక్ష్మి, కళ్యాణ్ రామ్ అసాధ్యుడు ఇలాంటి సినిమాలకు కథలు అందించాడు. రెండో సినిమా కోసం సిద్ధమవుతున్న తరుణంలో కరోనా వైరస్ కాటుకు బలైపోయాడు. ఈ మధ్య శ్రవణ్ అనే దర్శకుడు కూడా మరణించాడు. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియుడు సినిమాను తెరకెక్కించాడు ఈయన. అలాగే శ్రీ విష్ణు హీరోగా మా అబ్బాయి సినిమాను తెరకెక్కించిన కుమార్ వట్టి కూడా ఈ మధ్య వైరస్ ధాటికి మరణించాడు.
శర్వానంద్ హీరోగా వచ్చిన స్వీకారం సినిమాకు కో-డైరెక్టర్ గా పనిచేసిన రాజా కూడా కరోనా మహమ్మారికి బలైపోయాడు. త్వరలోనే ఆయన దర్శకుడిగా పరిచయం కావాలని కథ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు తమిళం, కన్నడంలో కూడా చాలా మంది యువ దర్శకులు ఈ మాయదారి వైరస్ కారణంగా మరణిస్తున్నారు. ఎన్నో కలలు కంటున్న వాళ్ల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుంటే మధ్యలో వచ్చిన ఈ వైరస్ అందరి కలలు చెదరగొడుతుంది.
కరోనాతో విలవిల.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?