తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ మూవీ విడుదల కానుంది. లాక్ డౌన్ కు ముందే అన్నాత్తే షూటింగ్ పూర్తవ్వాల్సి ఉండగా..ఆరోగ్యకారణాలు, కోవిడ్ ఎఫెక్ట్తో ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లారు రజినీకాంత్. ఇదిలా ఉంటే తలైవా చేయబోతున్న నెక్ట్స్ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారన్న చర్చ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో జోరుగా నడుస్తోంది.
రజినీకాంత్ కు ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు కథలు వినిపించారట. ఇందులో యువ దర్శకులు కూడా ఉండగా..వారిలో రజినీ కుమార్తె సౌందర్య కూడా ఉన్నట్టు టాక్. తలైవా తన తర్వాతి సినిమాను కూతురు డైరెక్షన్ లో చేసేందుకే ఎక్కువ చూపిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు రజినీకాంత్ అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. సౌందర్య ఇప్పటికే రజినీకాంత్ తో యానిమేటెడ్ యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్