సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత 10 రోజులుగా అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా అభిమానుల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ వీడియో ఒక్కటి కూడా బయటికి రాలేదు. దాంతో ఆయన బాగానే ఉన్నాడని చెబుతున్నా కూడా.. ఆస్పత్రిలో ఆయన ఎలా ఉన్నాడో అనే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. పైగా సర్జరీ జరిగిన తర్వాత సాయి ఆరోగ్యం ఎలా ఉంది.. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం మెగా కుటుంబ సభ్యులు త్వరలోనే అధికారికంగా చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సెప్టెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ వేడుకలో తేజూ ఆరోగ్యం గురించి పవన్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన మేనల్లుడు ఎలా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది.. తదితర విషయాలపై అభిమానులకు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నాడు పవర్ స్టార్. మరోవైపు సినిమా కంటే కూడా సాయి ధరమ్ తేజ్ గురించి పవన్ ఏం చెప్తాడు అనే విషయం గురించి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం సాయి ఆరోగ్యం బాగానే ఉందని.. అయితే మెడ సమీపంలో కాలర్ బోన్ సర్జరీ జరగడంతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడని.. మరి కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో బయటికి రావడానికి మాత్రం కనీసం నెల రోజులకు పైగానే పడుతుందని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఏదేమైనా మెగా కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన కనీసం ఒక్క ఫోటో గాని.. వీడియో గాని విడుదల చేస్తే అనుమానాలు అన్నీ పటాపంచలైపోతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Love story | లవ్స్టోరి సినిమా రివ్యూ
Siri: ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు.. వెక్కి వెక్కి ఏడ్చిన సిరి
Priyanka: నాకు పిల్లలు పుట్టరని అన్నాడు..అమ్మ అయ్యేందుకు లక్షలు ఖర్చు పెట్టా..!
Kajal: తల్లిదండ్రులపైన పోలీస్ కంప్లైంట్ చేసిన కాజల్
Naga Chaitanya: సమంతతో విడాకుల విషయంపై నోరు విప్పిన నాగ చైతన్య
పీఆర్ ఎజెన్సీ పెట్టుకున్న రష్మిక మందన్నా