గత కొద్ది రోజులుగా మీడియాలో నాగ చైతన్య- సమంత విడాకుల అంశం నానుతూనే ఉంది. ఎట్టకేలకు దీనిపై నాగ చైతన్య క్లారిటీ ఇచ్చాడు. లవ్ స్టోరీ చిత్ర ప్రమోషన్లో మాట్లాడిన ఆయన నా కెరీర్ తొలినాళ్లలో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ను కలిపి ముందుకు వెళ్లే వాడిని. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి జీవితాన్ని కొనసాగించను అని అన్నారు. నేను నా తాత, తండ్రి నుండి ఎక్కువగా నేర్చుకుంటాను.
సినిమా పరిశ్రమలో ఎలా ఉండాలి అనేది నా పేరెంట్స్ నుండి నేర్చుకున్నాను. ప్రొఫెషనల్ లైఫ్ను, పర్సనల్ లైఫ్ను వాళ్లు ఎలా బ్యాలెన్స్ చేస్తానరనే విషయాన్ని వారి నుంచి గ్రహించాను. ఇంట్లో బయటి విషయాలు ఎక్కువగా డిస్కస్ చేయోద్దని వారి దగ్గర నుండే నేర్చుకున్నాను. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియా ప్రభావం నాపై ఉండదు.
నా జీవితం గురించి మీడియా అతిగా కవర్ చేయడం బాధించాయి. మొదట్లో ఆ వార్తలు విని బాధ అనిపించింది. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను . గతంలో మాదిరిగా మీడియా లేదు.ఒక వార్త క్షణాలలో వైరల్ అవుతుంది. ఇప్పుడు రోజుకు ఒక వార్త మరో వార్తను రిప్లేస్ చేస్తున్నది. అయితే నిజాలే ప్రజల మదిలో నిలిచిపోతున్నాయి అంటూ చైతూ చెప్పుకొచ్చాడు. అయితే అర్ధరహితమైన వార్తలు నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదని ఆయన స్పష్టం చేశాడు.