బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తలైవి (Thalaivi). దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ ప్రాజెక్టులో ఎంజీ రామచంద్రన్ (MGR) పాత్రలో అరవింద్ స్వామి కనిపించగా..మధుబాల కీలక పాత్ర పోషించింది. తలైవి చిత్రానికి బాక్సాపీస్ వద్ద మంచి టాక్ వస్తోంది. కంగనా, అరవింద్ స్వామి పాత్రలపై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన విష్ణు ఇందూరి (Vishnu induri)కి కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు ఇందూరి మాట్లాడుతూ..కేవలం నాన్ థ్రియాట్రికల్ హక్కులతోనే సినిమా బడ్జెట్ రికవరీ అయిందని అన్నారు. అంతేకాదు సినిమా విడుదల విషయంలో తమ బృందానికి ఆసక్తికరమైన ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఏఎల్ విజయ్ దర్శకత్వ ప్రతిభపై ఉన్న నమ్మకంతో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసినట్టు చెప్పారు.
బయోపిక్ గా వచ్చిన తలైవి చిత్రానికి పెట్టిన డబ్బుల కన్నా ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు రావడం సంతోషంగా ఉందని, ఈ విజయం క్రెడిట్ మొత్తం చిత్రబృందానికి వర్తిస్తుందని అన్నారు.
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!