కంది/సంగారెడ్డి : ఐఐటీ హైదరాబాద్లో నూతనంగా సబ్ పోస్ట్ ఆఫీస్ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ వీఎస్ మూర్తితో పాటు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇక పై ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లోని అన్ని రకాల పోస్టల్ సర్వీస్ కార్యకలాపాలు కొనసాగిస్తామని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ కు కొత్త పిన్ కోడ్ కూడా ఈ సందర్భంగా అందజేశామని తెలిపారు. ఐఐటీ క్యాంపస్లో ఇప్పటికే అన్ని రకాల సర్వీసులను విద్యార్థులకు ఇతర సిబ్బందికి అందుబాటులో ఉంచామన్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి