Vikrant Massey | అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు తప్ప విమానంలో ఉన్న 241 మంది మరణించారు. అయితే ఇందులో బాలీవుడ్ నటుడు 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే సోదరుడు కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై విక్రాంత్ స్పందిస్తూ.. చనిపోయింది తన సోదరుడు కాదని… తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని విక్రాంత్ తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన ఊహించని విషాదం నా హృదయాన్ని కలచివేసింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభుతి తెలుపుతున్నాను. ఈ బాధ నాకంటే నా అంకుల్ క్లిఫార్డ్ కుందర్కు ఇంకా ఎక్కువ. ఈ ప్రమాదంలో మా మామ క్లిఫోర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ కూడా చనిపోయాడు. అతను ఈ విమానంలో ఫస్ట్ ఆఫీసర్గా పనిచేశాడు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. క్లైవ్ నా సోదరుడు అనే వార్తలు చాలా మీడియా ఛానెల్లలో వస్తున్నాయి. కానీ క్లైవ్ నా సోదరుడు కాదు. వారు తమ కుటుంబ స్నేహితులు అని విక్రాంత్ రాసుకోచ్చాడు.
Read More