Sai Pallavi| మణిరత్నం సినిమాలంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి రొమాంటిక్ డ్రామా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మణిరత్నం ముందుగా శింబుతో కానీ ధ్రువ్ విక్రమ్తో కానీ అంతా చేస్తాడనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి చేతిలోకి వెళ్లింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటించనుంది. తాజా టాక్ ప్రకారం ఇప్పటికే ఏఆర్ రెహమాన్ టీం కొన్ని ట్రాక్స్ కూడా కంపోజ్ చేసిందట. విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్నసినిమాలు పూర్తవగానే.. మణిరత్నం ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీ అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందట.
2025లో థగ్లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మణిరత్నానికి ఈ మూవీ భారీ నిరాశనే మిగిల్చింది. విజయ్ సేతుపతి ప్రస్తుతం జైలర్ 2తోపాటు పలు సినిమాలను లైన్లో పెట్టాడు. సాయిపల్లవి Ek Dinతోపాటు ధనుష్తో D55, రామాయణ పార్ట్ 1, రామాయణ పార్ట్ 2లలో నటిస్తోంది.
#ManiRatnam’s next is set to be a romantic drama starring #VijaySethupathi & #SaiPallavi ❣️✨
• Music by #ARRahman — buzz says most of the tracks are already composed ⭐
• Shoot to begin after VJS wraps current commitments 👍
• Interestingly, the project first moved… pic.twitter.com/ijOt7LTIpv— Kollywood Ent (@Kollywoodent) February 23, 2026
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్గా సంచలనం!