Vijay Devarakonda | ఈరోజు విత్తనం నాటితే మరుసటి రోజు చెట్టు అయిపోదు కదా..! ఈరోజు నాటిన విత్తనం కొన్ని రోజులకు చెట్టుగా మారి ఫలితం వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్లో కొందరు హీరోలు ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్నారు.. అన్నింటికీ డేట్స్ ఇస్తున్నారు.. వీలైనంత వేగంగా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు.. తర్వాత వాటి ప్రమోషన్స్ తో బిజీ అయిపోతున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సైన్ చేయడం వల్ల కేవలం ఏడాది గ్యాప్ లో మూడు నాలుగు సినిమాలతో వస్తున్నారు హీరోలు. కావాలంటే ప్రభాస్ నే తీసుకోండి.. బాహుబలి కోసం ఐదేళ్లు రాసిచ్చిన ఈయన.. ఆ తర్వాత సాహో కోసం మరో 2 సంవత్సరాలు తీసుకున్నాడు. కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడే ఒకేసారి నాలుగు సినిమాలు సైన్ చేశాడు ప్రభాస్.
కరోనా కారణంగా అన్ని ఆలస్యం అయ్యాయి కానీ.. వాటి ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ఏడాది తిరగకుండానే వరుస సినిమాలతో వస్తున్నాడు ప్రభాస్. గతేడాది సమ్మర్ లో రాధేశ్యామ్ విడుదల కాగా.. ఈ సమ్మర్లో ఆదిపురుష్ అంటూ వచ్చాడు. సెప్టెంబర్లో సలార్.. జనవరిలో ప్రాజెక్ట్ K విడుదలవుతున్నాయి. అలాగే చిరంజీవి కూడా ఆరు నెలలకు ఓ సినిమా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇదే చేస్తున్నాడు.
లైగర్ తర్వాత భారీ బ్రేక్ తీసుకున్న ఈయన.. రాబోయే 9 నెలల్లో 3 సినిమాలతో రావాలని చూస్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. వేగంగా జరుగుతుంది కూడా. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు పరశురాం దర్శకత్వంలో సినిమా జులై ఎండింగ్ లో మొదలు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. అటు గౌతమ్.. ఇటు పరశురాం రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలనేది రౌడీ హీరో ప్లాన్. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల కానుంది. వచ్చే ఏడాది సమ్మర్లో గౌతమ్ తిన్ననూరి సినిమా.. జూలై, ఆగస్టు సమయంలో పరశురాం సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే జరిగితే ఏడాది తిరగకుండానే విజయ్ దేవరకొండ నుంచి మూడు సినిమాలు రానున్నాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ కెరీర్ ఈ మూడు సినిమాలపైనే ఆధారపడి ఉంది.
Rangabali Movie | రంగబలి.. రంగుపడింది.. నాగశౌర్యకు ఈ సారి కూడా పెద్ద దెబ్బే..