Actress Keerthy Suresh | ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ఆ ‘మహానటి’తో ప్రేక్షకుల గుండెల్లో కుర్చీ వేసుకుని కూర్చుంది. ఈ సినిమా విజయంతో కీర్తి సురేష్కు అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తి కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఫ్లాప్లుగా నిలిచాయి. చాలా కాలం తర్వాత సాని కాదియం, సర్కారు వారి పాట వంటి వరుస హిట్లతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇక ఈ ఏడాది వచ్చిన దసరాతో తిరుగులేని విజయం సాధించింది.
మహానటి తర్వాత మళ్లీ ఆ రేంజ్ నటన దసరా సినిమాలోనే కనిపించింది. వెన్నెల పాత్రలో నటించింది అనడం కంటే జీవించింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కీర్తి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యనరేషన్ తీసుకుంటున్న కీర్తి.. తన తొలి సినిమాకు ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు. కీర్తి చిన్నప్పటి నుంచే సినిమాలు చేసింది. బాలనటిగా మలయాళంలో మూడు సినిమాలు చేసింది. కాగా బాలనటిగా కీర్తి సురేష్ తొలి పారితోషికం రూ.500 అట. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ వెల్లడించాడు.
తండ్రి ప్రొడ్యూసర్, తల్లి నటి ఇలా కీర్తి తల్లిదండ్రులిద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆమె సినీ పరిశ్రమలోకి రావడం చాలా తేలికైంది. కానీ తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా కీర్తి తొలిసారి 2000లో పైలట్స్ అనే సినిమాలో కెమెరా ముందుకు వచ్చింది. ఈ సినిమాను నిర్మించింది కీర్తి సురేష్ తండ్రే. కాగా ఈ సినిమాలో నటించినందుకు సురేష్.. కీర్తికు 500 ఇచ్చాడట. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన రెండు సినిమాలు కూడా కీర్తి సురేష్ తండ్రి ప్రొడ్యూస్ చేసినవే. ఇక ప్రస్తుతం కీర్తి ఒక్కో సినిమాను 2 నుంచి 3 కోట్ల రేంజ్లో పారితోషికం తీసుకుంటుందట.