కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. కాగా విజయ్ (Vijay66th) కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)తో విజయ్ తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations)లో ఈ సినిమా చేయనున్నారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ నటీనటులతో భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టు రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. విజయ్ 65వ సినిమా బీస్ట్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. దిల్ రాజు అండ్ టీం ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలపై త్వరలోనే వెల్లడించనున్నట్టు టాక్. వంశీపైడిపల్లి ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఊపిరి అవార్డును గెలుచుకుంది.
ఈ చిత్రం తర్వాత మళ్లీ రెండు భాషల్లో విజయ్ తో (66వ) సినిమా తీయబోతున్నాడు వంశీ పైడిపల్లి. మరి ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా రాబోతుందని చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. 2023లో వంశీపైడిపల్లి-విజయ్ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.
Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!