Raj Kumar Kohli | బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత రాజ్ కుమార్ కోహ్లీ (Raj Kumar Kohli ) మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 93. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రాజ్కుమార్ మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కహానీ హమ్ సబ్ కీ, నాగిన్, ముకాబ్లా, జానీ దుష్మన్, పతి పత్నీ ఔర్ తవైఫ్, రాజ్ తిలక్, జీనే నహీ దూంగా తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. గౌరా ఔర్ కాలా, డంకా, లూటేరా వంటి హిందీ చిత్రాలతోపాటు దుల్లా భట్టి, మెయిన్ జట్టి పంజాబ్ ది, పిండ్ డి కుర్హి వంటి పంజాబీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read..
Mumbai Airport | బాంబులతో పేల్చేస్తామంటూ.. ముంబై ఎయిర్పోర్ట్కు బెదిరింపులు
Snake | గదిలోకి పామును వదిలి.. భార్య, రెండేళ్ల కుమార్తెను చంపిన వ్యక్తి
Abdul Razzaq | ఫైనల్లో భారత్ ఓడిపోవడం మంచిదే.. మరోసారి టీమిండియాపై రజాక్ అక్కసు