టాలీవుడ్ (Tollywood)హీరో వెంకటేశ్ (Venkatesh) చాలా ఏండ్ల తర్వాత బాలీవుడ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)-ఫర్హద్ సామ్జీ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కభి ఈద్ కభి దివాళి (Kabhi Eid Kabhi Diwali). ఈ చిత్రంలో వెంకీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సాజిద్ నదియావాలా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
తాజా అప్ డేట్ ప్రకారం వెంకటేశ్ జూన్ చివరి వారంలో ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడట. అంతేకాదు వెంకీ ఫన్నీ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. సల్లూభాయ్, వెంకీ క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై ఎలా ఉండబోతుందని ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. ఈ చిత్ర షూటింగ్ మే 11న ముంబైలో వేసిన స్పెషల్ సెట్లో షురూ అయింది. సల్మాన్ ఖాన్ మరోవైపు కత్రినాకైఫ్తో కలిసి నటిస్తోన్న టైగర్ 3ని పూర్తి చేసే పనిలో కూడా ఉన్నాడు.
కెరీర్ ప్రారంభం నుంచి సల్మాన్ ఖాన్, వెంకటేశ్ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు వెంకీ.