‘ఉప్పెన’ సినిమా విజయంలో కృతి శెట్టి కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహమే లేదు. కృతి శెట్టి తన అందంతో ,నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ ఒక్క సినిమాతో కృతి తెలుగు, తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. తెలుగుతోపాటు తమిళంలొ కూడా ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పడు కృతి శెట్టి తెలుగులో టైర్ టూ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది.
ప్రస్తుతం మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తుంది. ఇదే కాకుండా నానితో ‘శ్యామ్ సింగ రాయ్’, రామ్-లింగుస్వామి తెలుగు-తమిళ ప్రాజెక్ట్ లలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉండగా కృతి బుల్లితెరపై కూడా సందడి చేయబోతుందట. జీ తెలుగు ఛానల్ వాళ్లు బుల్లి తెర కార్యక్రమాల కోసం కృతి శెట్టి ను సంప్రదించారట. దాని కోసం కృతిశెట్టి కోటి రూపాయల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఈమె జీ టీవి జరిపే ప్రోగ్రాంలలో గెస్ట్ గా వెళ్లాలి. అలాగే జీ తెలుగు లో ప్రసారమయ్యే సీరియల్స్ ను ప్రమోట్ చేయాలి అని సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. గతంలో మహేష్ బాబు ,రమ్య కృష్ణలు ఇదే తరహలో సీరియల్స్ ని ప్రమోట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..