Konidela Upasana | టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మపురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన (Konidela Upasana ) ఆసక్తికర విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
తన కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్లు ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ‘ఇప్పుడు మా కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు ఉండటం గౌరవంగా ఉంది. ఒకరు మా తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి (Dr Prathap C Reddy), ఇంకొకరు మా మామయ్య డాక్టర్ చిరంజీవి కొణిదెల. మా కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడం ఆశీర్వచనంగా భావిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
honoured & blessed to have 2 #PadmaVibhushan 🙏 awardees in the Family.
My Grandfather Dr Prathap C Reddy &
My Father in law Dr Chiranjeevi Konidela @KChiruTweets @DrPrathapCReddy https://t.co/F3nfmPLAA4 – my LinkedIn pic.twitter.com/hBXvDv4umA— Upasana Konidela (@upasanakonidela) January 27, 2024
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడైన ప్రతాప్ సి రెడ్డికి కేంద్రం 1991లో పద్మ భూషణ్ ప్రకటించింది. ఆ తర్వాత 2010లో పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇక చిరంజీవికి 2006లో పద్మ భూషణ్ వరించగా.. ఇప్పుడు తాజాగా పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు.
కాగా, భారతదేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్కు ఈ ఏడాది అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరు తెలుగువారికి ఈ అవార్డు వరించడంతో.. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు చిరంజీవి, వెంకయ్య నాయుడులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read..
Kerala Governor | విద్యార్థుల నుంచి నిరసన సెగ.. కేరళ గవర్నర్కు భద్రత పెంపు
Mallikarjun Kharge | ఇండియా కూటమికి బీటలు.. ఏం జరుగుతుందో చూద్దాం అన్న మల్లికార్జున ఖర్గే
Donald Trump | పరువు నష్టం కేసులో ట్రంప్కు షాక్.. భారీ జరిమానా విధించిన ఫెడరల్ కోర్టు