కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి రోజుకు వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కూడా కరోనాతో కన్నుమూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సెలబ్స్ కన్నుమూయగా, తాజాగా ప్రముఖ బుల్లితెర నిర్మాత జె.కృష్ణస్వామి కరోనా మహమ్మారి బారిన పడి గురువారం చెన్నైలో కన్నుమూశారు.
కస్టమ్స్ శాఖలో ఉద్యోగం చేసిన ఆయన ఆ తర్వాత బుల్లితెరకు పరిచయం అయ్యారు. అభినయ క్రియేషన్స్ సంస్థ ద్వారా మాంభూమి కి మామియార్, మహారాణి సెంగమలం, గ్రీన్ సిగ్నల్, చెల్లమ్మ, దేవతై తదితర మెగా సీరియ ళ్లు నిర్మించారు. వారం క్రితం కరోనా రావడంతో స్థానిక క్రోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గురువారం రోజు అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసారు. ఆయన మృతికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.