తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) మూవీ లవర్స్ (Tollywood Movie lovers) సంఖ్య ఎంతంటే చెప్పడం కష్టమైన పనే. కథాబలమున్న సినిమాలతోపాటు భారీ బడ్జెట్ (Big films) సినిమాలకు కావాల్సిన మద్దతును టికెట్ల రూపంలో అందించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఎంతిష్టమో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో కుదేలైన సినీ పరిశ్రమను మళ్లీ టికెట్ల రూపంలో వెచ్చించి గాడిలో పడేసే ప్రయత్నం చేశారు ఆడియెన్స్.
ఇక థర్డ్ వేవ్ కూడా వచ్చి దాటి పోతుండటంతో భారీ బడ్జెట్ సినిమాలు వన్ బై వన్ వేసవిలో వినోదాన్ని అందించేందుకు సందడి రెడీ అవుతున్నాయి. రాధేశ్యామ్, భీమ్లా నాయక్ (Bheemla Nayak) , ఆర్ఆర్ఆర్ (RRR) , ఆచార్య, సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) రాబోయే 3 నెలల్లో విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటితోపాటు పక్కా కమర్షియల్, రామారావు ఆన్ డ్యూటీ, గని, అంటే సుందరానికి చిత్రాలు కూడా ఇదే టైంలో రాబోతున్నాయి.
తాజా అంచనాల ప్రకారం ప్రతీ పెద్ద సినిమా సుమారు తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు మార్కెట్ చేయబోతాయని తెలుస్తోండగా..ఆర్ఆర్ఆర్ మాత్రం రూ.150 కోట్లు మార్కెట్ చేస్తుందని టాక్ నడుస్తోంది. అంటే ఈ అన్నీ సినిమాలు బయ్యర్ల నుంచి సుమారుగా రూ.750 కోట్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలు, బయ్యర్లు సేఫ్ జోన్లో ఉండాలంటే మూవీ లవర్స్ టికెట్లు కొనుగోలు చేసేందుకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందట.
అంటే మూవీ లవర్స్ యావరేజ్గా ప్రతీ నెల రూ.500 కోట్లు టిక్కెట్లకు పెట్టాలన్నమాట. కరోనా సంక్షోభం నేపథ్యంలో గత రెండేళ్లలో ఇలాంటి భారీ టాస్క్ ముందుకు రాలేదు. కానీ ఈ సారి మాత్రం చాలా ఎదురుచూపుల తర్వాత క్రేజీ భారీ బడ్జెట్, స్టార్ హీరోల చిత్రాలు వరుసగా వస్తుండటంతో..మరి తెలుగు ప్రేక్షకులు కూడా టికెట్ల కొనుగోలు విషయంలో తగ్గేలే అంటారో..? లేదో ? చూడాలి.