Tollywood Drug case | చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగుతుంది. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ ఎదుట మన సినీ ప్రముఖులు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. ఈయనకు ఆగస్ట్ 31 డేట్ ఇచ్చారు. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు వరసగా సినీ ప్రముఖులు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు హాజరు కావాల్సి ఉండగా.. అరగంట ముందుగానే వచ్చేశాడు పూరీ. 10.05 గంటలకే ఆఫీసుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 5 గంటల పాటు ఈ విచారణ సాగిందని తెలుస్తుంది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి రానున్నాయి. ఈ సందర్భంగా మీడియా మాట్లాడాలని ప్రయత్నించినా కూడా పూరీ స్పందించలేదు. పూరీని జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల టీమ్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 12 మంది సినీ ప్రముఖులకు వేర్వేరు డేట్స్ ఇచ్చారు. మరి మిగిలిన 11 మంది ప్రముఖులు.. ఏయే తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు అనేది చూద్దాం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Shraddha Kapoor| శ్రద్దాకపూర్ వెడ్డింగ్పై శక్తికపూర్ ఏమన్నాడంటే..?
Bandla: ఎన్టీఆర్తో గొడవపై స్పందించిన బండ్ల గణేష్..!
హాలీవుడ్ నిర్మాతగా దీపికాపదుకొనే..?
హిమాలయాల్లో జ్యోతిక.. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు