ఈ మధ్య బండ్ల గణేష్ నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు.సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేస్తూ, మరోవైపు ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. రీసెంట్గా తాను ఒక రోజులేట్ అయితే చనిపోయే వాడినని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
కరోనా వలన 80 శాతం ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని ఆ సమయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని అన్నారు.పవన్ కళ్యాణ్ నాకు కెరీర్ పరంగా లైఫ్ ఇస్తే చిరంజీవి జీవితాన్ని ఇచ్చారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక తాజాగా ఎన్టీఆర్తో జరిగిన గొడవలపై తనదైన శైలిలో స్పందించారు.
బండ్ల గణేష్.. ఎన్టీఆర్తో కలిసి బాద్ షా, టెంపర్ చిత్రాలని నిర్మించాడు. టెంపర్తో ఎన్టీఆర్కి మంచి హిట్ ఇచ్చిన బండ్ల గణేష్ ఈ సినిమా తర్వాత సినిమాలు నిర్మించడం ఆపేశాడు. అయితే ఎన్టీఆర్,బండ్లగణేష్కి గొడవ జరిగినట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దానిపై స్పందించిన ఆయన అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మిస్ కమ్యునికేషన్ వల్ల అలా జరిగింది. ఇది గొడవ కాదు. ఎన్టీఆర్తో నాకు ఎలాంటి విబేధాలు లేవంటూ చెప్పుకొచ్చారు బండ్ల.