వికారాబాద్, మే 16, (నమస్తే తెలంగాణ): కొవిడ్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. బాధితుల దగ్గరకు రాలేని, పలకరించలేని దుస్థితి. సొంతవారిని సైతం భౌతిక దూరం పా టించేలా చేస్తున్నది. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు, అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఆ సమయంలో ఎప్పుడూ మీ సేవకు మేము న్నాం అంటూ 108 అంబులెన్సు సిబ్బంది సిద్ధం గా ఉంటున్నారు. ఈఎంటీ, పైలట్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా బాధితులను ఆసుత్రులకు,క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అంబులెన్స్లోని ఆక్సిజన్ను అందిస్తూ సకాలంలో దవాఖానల్లో చేర్పిస్తున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందేలోపు ప్రథమ చికిత్స అం దించి వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. 108 సిబ్బందిలో ఇప్పటికే 13 మంది కి పాజిటివ్ వచ్చింది.అందులో ఐదు మంది కోలుకొని మళ్లీ డ్యూటీ చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 108 అంబులెన్సులు 11 అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొత్తం 44 మంది విధులు నిర్వహిస్తున్నారు. పగలు 22 మంది ,రాత్రి 22 మంది చొప్పున 24 గంటల పాటు విధుల్లో ఉంటున్నారు. జిల్లాలోని కొడంగల్, బషీరాబాద్, యాలాల్, తాండూరు-1, తాండూరు-2, పెద్దేముల్, బంట్వారం,మోమిన్పేట, వికారాబాద్, పరిగి,కుల్కచర్ల తదితర ప్రాం తాల్లో ఈ 108 వాహనాలు అందుబాటులో ఉన్నాయి .ప్రతి నెల ఒక్కో వాహనం 80 నుంచి 120 వరకు అన్ని రకాల కేసులను ఆసుపత్రులకు చేర్చుతున్నాయి. కొవిడ్తో పాటు, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి ఫోన్ రా గా నే ఈ వాహనాలు బయలుదేరుతాయి. బాధితు ల దగ్గరకు నిమిషాల్లో చేరుకుని 108 సిబ్బంది ప్రథమ చికిత్సను అందిస్తారు.
పైలెట్ వాహనాన్ని నడపడంతో పాటు అత్యవసర సమయంలో ఈఎంటీకి సాయం అందిస్తారు.ఇటీవల కొవిడ్ బాధితురాలికి సాధారణ ప్రసవం చేశారు. జిల్లాలోని కుల్కచర్ల 108 అంబులెన్సు డ్రైవర్లు,ఈఎంటీలు మహిళకు ప్రసవం చేశారు. ప్రమాదం అని తెలిసినా ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. ఇలా చాలా మంది ఈఎంటీలు,పైలెట్లు కొవిడ్ బారిన పడుతున్నా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. పాజిటివ్ వచ్చినా బెదరక కోలుకున్నాక విధుల్లోకి చేరుతున్నారు.
కొవిడ్ బాధితులకు అందుబాటులో సేవలు
కొవిడ్ బాధితులకు 108 వాహన సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. చాలా మంది బాధితులు సేవలు వినియోగించుకుంటున్నారు. రాత్రి వేళ శ్వాస ఇబ్బంది వస్తున్నదని ఫోన్లు వస్తున్నాయి. వెంటనే అక్కడికి చేరుకుని ఆక్సిజన్ అందించి ఆసుపత్రికి చేర్చుతున్నాం. అందు బాటులో స్థానిక వాహనాలు లేకున్నా, సమీప ప్రాంతాల నుంచి వాహనాలను పంపిస్తున్నాం. ఇప్పటికే 13 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. అందు లో 5 మంది నయం అయిన తర్వాత మళ్లీ డ్యూటీ చేస్తున్నారు. అయినా ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వహిస్తున్నారు.
70 మందిని ఆసుపత్రులకు చేర్చా
108 అంబులెన్సులో దాదాపుగా 70 మంది పాజిటివ్ కేసులను హైదరాబాద్లోని గాంధీ, టిమ్స్, ఎర్రగడ్డ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిం చాం.కొవిడ్ పాజిటివ్ ఉన్న వారిని ఆసుపత్రులకు తరలిం చడం అదృష్టం గా భావిస్తున్నా. బాధితులకు సేవ చేయడంలో భయపడకూడదు. ధైర్యం తో పనులు చేస్తున్నాం.ఆక్సిజన్ అవసరమైన వారికి అందించి ఆసుపత్రు లకు తరలిస్తున్నాం.విధుల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లల దగ్గరకు వెళ్లడం లేదు.డ్యూటీ సంతృప్తినిచ్చింది. – సంఘమేశ్వర్,పైలెట్
సకాలంలో స్పదిస్తున్నాం
కొవిడ్ కష్టకాలంలో విధులు సంతృప్తినిస్తున్నాయి. కరోనా బాధితులకు ఆసుపత్రులకు తీసుకెళ్లేం దుకు ప్రైవేట్ వాహనాదారులు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. ఆ సమయంలో 108 అంబులెన్సు వారికి ఎంతో ఊరట కలిగిస్తున్నది. వాహనం సైరన్ మోత వినగానే వారికి బతుకుపై ఆశ కలిగిందని కొందరు చెబుతుంటారు. సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నాం.
అదృష్టంగా భావిస్తున్నా..
కొవిడ్ బాధితులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సమయంలో బాధితులను ఎవరూ ముట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. మాకు వారి సమాచారం రాగానే వెంటనే అక్కడికి చేరుకుంటున్నాం. పాజిటివ్ అని తెలియగానే మేము పీపీ కిట్లు ధరిస్తాం. వారికి కూడా పీపీ కిట్లు అందిస్తాం. అక్కడి నుంచి ఐసొలేషన్, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం.
-బద్రుద్దీన్ నాయక్, పైలెట్