2021 తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)కి చాలా విషాదాలనే మిగిల్చింది. మరీ ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రముఖులు కన్నుమూసారు. అలా మనకు దూరమైన వాళ్లలో ప్రముఖ నటుడు, జర్నలిస్ట్ TNR కూడా ఉన్నారు. ఆయనతో పాటు కత్తి మహేష్ (Kathi mahesh) కూడా ఈ మధ్యే కన్నుమూసారు. ఈయన మరణానికి కరోనా కారణం కాదు కానీ యాక్సిడెంట్ లో మరణించాడు. ఇప్పుడు ఈ ఇద్దరి నటుల అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
మరోసారి వాళ్లను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. వాళ్ళు నటించిన సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. దాంతో వాళ్ళ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.. గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. 50 ఏళ్ళ లోపే ఈ ఇద్దరు ప్రముఖులు మరణించడం బాధాకరమే. ఈ వారం కత్తి మహేష్ నటించిన బజార్ రౌడీ సినిమా విడుదల కానుంది. సంపూ సినిమాలలో కచ్చితంగా కత్తి మహేష్ నటిస్తుండేవాడు.
మరోవైపు టిఎన్ఆర్ నటించిన SR కళ్యాణమండపం ఈ మధ్యే విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈయన నటించిన మరో సినిమా వివాహ భోజనంబు కూడా విడుదలకు సిద్ధమైంది. కమెడియన్ సత్య ఈ సినిమాలో హీరోగా నటించాడు. సందీప్ కిషన్ నిర్మాతగా ఈ సినిమా వస్తుంది. మొత్తానికి ఓ వైపు టిఎన్ఆర్, మరోవైపు కత్తి మహేష్ నటించిన సినిమాలు వాళ్లు చనిపోయిన తర్వాత విడుదలవుతుండటంతో సన్నిహితులు ఎమోషనల్ అవుతున్నారు.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!