Sonu Sood | బెట్టింగ్ యాప్స్ (betting app case) వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో రియల్ హీరోగా పేరొందిన స్టార్ నటుడు సోనూసూద్కు ఈడీ సమన్లు జారీ చేసింది. 1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి సమన్లు పంపింది. ఈనెల 24న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
The Enforcement Directorate has summoned Bollywood actor Sonu Sood to appear before it for questioning at its headquarters in Delhi on September 24 in connection with the illegal betting app 1xBet case: Officials
(file pic) pic.twitter.com/ULwa4pS6fo
— ANI (@ANI) September 16, 2025
అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులతో పాటు పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక నిషేధిక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. టాలీవుడ్ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సైతం విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్సింగ్, యువరాజ్సింగ్, సురేశ్ రైనాలను సైతం ఈడీ విచారించింది. శిఖర్ను ఈ నెల 4న ఈడీ ఎనిమిది గంటల పాటు విచారించింది.
Also Read..
Raj Kundra | రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్ కుంద్రాను ఐదు గంటల పాటూ విచారించిన పోలీసులు
Megastar Chiranjeevi | ‘కిష్కింధపురి’పై చిరంజీవి ప్రశంసలు.. హారర్తో పాటు మంచి సందేశం ఉందన్న చిరు
OG Movie | ‘OG’కి ప్రీమియర్లు లేవా?.. పవన్ అభిమానులకు నిరాశ