Kishkindhapuri | యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాత సాహు గారపాటి నిర్మాణంలో వచ్చిన మరో చిత్రం కిష్కింధపురి. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన నాకు చిత్రయూనిట్ అంతా కలిసి మంచి ప్రయత్నం చేశారు అనిపించింది. ఈ చిత్రం ఇంతటి విజయం సాధించినందుకు చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. సాధారణంగా హారర్ సినిమాలంటే భయంని ఎలివెట్ చేస్తూ.. దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది. కానీ కిష్కింధపురిలో హారర్తో పాటు మంచి సైకాలాజికల్ పాయింట్ని జత చేసి చెప్పడం చాలా బాగుంది. శారీకర వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమని మేకర్స్ చక్కని సందేశం ఇచ్చారు. ఈ సినిమాను ఇంత బాగా తెరకెక్కించిన దర్శకుడు కౌశిక్ని అభినందిచక తప్పదు. ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే అనుపమ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సంగీత దర్శకుడు చైతన్య మంచి పనితనం చూపించాడు. మొత్తంగా ప్రేక్షకులకు మంచి సినిమాను అందించిన నిర్మాత సాహు గారపాటికి కృతజ్ఞతలు.. ప్రస్తుతం థియేటర్లో ఆడుతున్న ఈ సినిమాను మీరు మిస్ అవ్వకండంటూ చిరు చెప్పుకోచ్చాడు.
#Kishkindhapuri is now certified by the BOSS ✅
Megastar @KChiruTweets Garu appreciated the team for coming up with a horror film laced with thilling elements ❤🔥❤🔥
Watch the THRILLING #Blockbusterkishkindhapuri at your nearest cinemas☠️
🎟️ Book your tickets for… pic.twitter.com/NvKtUUZqkz
— Shine Screens (@Shine_Screens) September 16, 2025