అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 1: అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తులైన బాబు జగ్జీవన్రాం, డాక్టర్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్రాం, 14వ తేదీన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముందస్తు ఏర్పాట్లపై గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ ప్రజావాణి మీటింగ్హాల్లో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా దళిత సంఘాల నాయకులతో ఆయన మాట్లాడారు. అధికారులు, దళిత సంఘాల నాయకుల సమన్వయంతో వారి జయంతులను ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాటు చేసుకుందామన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాంలాల్, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, దళిత సంఘాల నాయకులు విజయ్, నిరంజన్, బంగారయ్య, రాములు, గంగాధర్, మోహన్బాబు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.