42 years of Sankarabharanam | తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం శంకరాభరణం. ఈ సినిమా విడుదలై నేటికి 42 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 2 , 1980 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం కూడా ఇదే. అమెరికాతో పాటు ప్రపంచ నలుమూలల్లో ఎన్నో , దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ సినిమా. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా శంకరాభరణం గురించే ప్రస్తావన . శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో విడుదలైన ఈ సినిమా ఎంతోమందికి దానిపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.
ఇక అవార్డుల విషయానికి వస్తే జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదాత్మకం తో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలిసారిగా ఈ సినిమాతో ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. అలాగే ఉత్తమ గాయనిగా వాణీజయరాం, ఉత్తమ సంగీత దర్శకుడిగా కేవీ మహదేవన్ అవార్డులు అందుకున్నారు.Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ( ఫ్రాన్స్ ) లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నది. అలాగే 8 నంది అవార్డులు గెలుచుకుంది . ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి . శంకరాభరణం సినిమాపై చాగంటి కోటేశ్వర రావు మూడు రోజులు ప్రవచనాలు నిర్వహించారు. అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చిందీ శంకరాభరణం. ఇక ఈ సినిమా తర్వాత జేవీ సోమయాజులు ను అందరూ శంకరాభరణం శంకర శాస్త్రి అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి చాలా పవిత్రమైన తులసి పాత్రలో లీనమైపోయింది . ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు . ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాష తో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు . ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై & హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు . 42 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ చిత్రం ఏదో మాధ్యమంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది .
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
రాధేశ్యామ్ వచ్చేస్తుంది..విడుదల తేదీ ఎప్పుడంటే..?
Naga chaitanya | నాగ చైతన్య, సమంత కలవడం కలలో మాటే..ఇక అన్నీ అయిపోయాయి..!
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. అయినా కేజీఎఫ్ 2 డేట్ను టచ్ చేయని టాలీవుడ్
Jayaprada | సీనియర్ హీరోయిన్ జయప్రద ఇంట తీవ్ర విషాదం