సీనియర్ నటి జయప్రద (Jaya prada) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి నీలవేణి (Neelaveni) అనారోగ్యంతో కన్నుమూసారు. కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 1 సాయంత్రం ఆమె మరణించారు. తన తల్లి మరణవార్త తెలియగానే చిన్నపిల్లలా ఏడుస్తున్నారు జయప్రద. నీలవేణి చనిపోయినప్పుడు ఢిల్లీలో ఉన్నారు జయప్రద.
ఆమె నివాసం కూడా అక్కడే. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఢిల్లీకి మకాం మార్చింది ఈ సీనియర్ హీరోయిన్. తల్లి మరణవార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన అందం అభినయంతో ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది జయప్రద. ఎన్టీఆర్ సహా అగ్రకథానాయికుల అందరితోనూ నటించింది.
కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠిలో కలిపి 300కు పైగా సినిమాల్లో నటించింది జయప్రద. ఆ తర్వాత ఆమె రాజకియాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం జయప్రద బీజేపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు.