నాగ చైతన్య (Naga chaitanya), సమంత (Samantha) విడాకులు తీసుకుని నాలుగు నెలలు గడుస్తున్నా కూడా.. ఇప్పటికే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అంత అందమైన జంట ఎందుకు విడిపోయారు.. కలిస్తే బాగుంటుంది కదా.. మరోసారి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటూ ఎవరికి తోచిన సలహాలు ఇస్తున్నారు. స్వయంగా ఈ విషయంపై మాట్లాడిన నాగార్జున.. భార్య భర్తల మధ్య ఏం జరిగిందో వాళ్లకు మాత్రమే తెలుసు అని.. వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం పెద్దగా తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చైతు, సమంత జీవితంలో మళ్లీ కలిసే ఉద్దేశంలో కూడా లేరనేది క్లారిటీ వచ్చేసింది.
అయితే గత కొన్ని రోజులుగా చై సామ్ ను కలపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై వాళ్ళ అతి సన్నిహిత వర్గం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. నాగ చైతన్య, సమంత ఇప్పటికే అధికారికంగా విడిపోయారు. వాళ్ళు న్యాయపరంగా కూడా విడిపోవడం ఖాయం అంటున్నారు వాళ్లు. లీగల్ ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతుంది మరికొన్ని రోజుల్లో కోర్టు నుంచి విడాకులు కూడా మంజూరు కానున్నాయి. ఇక అప్పటి నుంచి ఎవరి బతుకు వాళ్లదే.
ఇప్పటికే ఇద్దరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు చైతు, సమంత. ఈ క్లారిటీతో అందరి అనుమానాలు నివృత్తి అయిపోయాయి. మళ్లీ జీవితంలో చైతు, సమంత కలిసే ఆలోచనే లేదు అనేది దీంతో క్లారిటీ వచ్చేసింది. అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కేవలం అవాస్తవమని.. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని కూడా తేలిపోయింది.