కరోనా సంక్షోభం ప్రభావంతో కుదేలైన సినీపరిశ్రమ (telugu cinema) మళ్లీ సక్సెస్ ఫుల్గా ట్రాక్పైకి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టడంతో నిర్మాతలకు కొంత ఉపశమనం దొరికినట్టైంది. మళ్లీ సాధారణ పరిస్థితులకు చేరుకునే దిశగా ముందుకెళ్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో సినీ కార్మికుల (film workers) వేతనాల విషయంలో స్తబ్దత నెలకొంది.
ఈ నేపథ్యంలో తమ వేతనాలను పెంచాలని చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగాలని నిర్ణయించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు రేపటి నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ నిలిపేయాలని నిర్ణయించినట్టు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) ప్రకటించింది. ఈ సమ్మెలో 24 క్రాఫ్ట్ (24 Crafts)లకు సంబంధించిన వాళ్లు పాల్గొననున్నారు.
వేతన సవరణ జరిగే వరకు షూటింగ్స్ ఉండవని ఫెడరేషన్ ప్రకటించింది. ఈ మేరకు రేపటి నుంచి టాలీవుడ్ (Tollywood)లో సినిమా షూటింగ్స్ బంద్ కానున్నాయి. సినీ కార్మికుల సమస్యకు పరిష్కారం లభించి..షూటింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది