బాక్సాపీస్ వద్ద రాధేశ్యామ్ (Radhe Shyam) చిత్రానికి వచ్చిన ఫలితంతో ఏ మాత్రం నిరాశచెందడం లేదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) . ఎందుకంటే ఈ సినిమా వచ్చేటప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ఓ ప్రాజెక్టు ఆదిపురుష్ (Aadipurush). 2023 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో రాముడిగా కనిపించబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఓకే చేసిన సినిమాలను గమనిస్తే..డైరెక్టర్లకు అందరికీ రెండో సినిమానే.
రన్ రాజా రన్ తర్వాత సుజిత్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రం సాహో. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన రెండో ప్రాజెక్టు రాధేశ్యామ్. ఇక తానాజీ తర్వాత ఓం రౌత్ చేస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే వీటిలో సాహో, రాధేశ్యామ్ రెండు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. మొదటి రెండు సినిమాల ఫలితాల దృష్ట్యా ప్రభాస్ పాత డైరెక్టర్లతో సినిమాలు చేసే విషయంలో వర్రీ అవుతున్నాడని టాక్ నడుస్తోంది. ప్రభాస్ మరోవైపు ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టు కే చేస్తున్నాడు.
మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా చేస్తుండగా..సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ డైరెక్టర్లంతా ప్రభాస్తో సినిమాకు సైన్ చేయించుకునే ముందు సక్సెస్ ట్రాక్ ఉన్నవాళ్లే. అయితే పాత డైరెక్టర్లలో ఒకరు సినిమా చేయాలని ప్రభాస్ దగ్గరికి వస్తే..ఆదిపురుష్ ఫలితం వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పాడట.
బాక్సాపీస్ వద్ద ఈ సినిమాకు వచ్చే రిజల్ట్ను బట్టి మళ్లీ పాత దర్శకులతో సినిమాలు చేసే విషయంపై ఆలోచించాలనుకుంటున్నాడట బాహుబలి యాక్టర్ ప్రభాస్. మరి ఆదిపురుష్ చిత్రం ప్రభాస్కు పునర్వైభవం తెస్తుందా..? లేదంటే ఇక కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తాడా..? అన్నది చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది