తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీపరిశ్రమ (Telugu cinema)కు చెందిన సినీ కార్మికులు (film workers) సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మెలో 24 క్రాఫ్ట్ (24 Crafts)లకు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మెతో ఫిల్మ్ ఫెడరేషన్ దిగొచ్చింది. కార్మికుల వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) నిర్ణయంతో కార్మికుల సమ్మె ముగిసింది. ఇక రేపటి నుంచి యదావిధిగా సినిమా షూటింగ్స్ కొనసాగనున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది.
త్వరలో వేతన పెంపు విధివిధానాలపై చర్చలు జరుగుతాయి. పెంచిన జీతాలు రేపటి నుంచి అమలు చేస్తాం. పెంచిన జీతాలు చెల్లించే బాధ్యత ఫెడరేషన్, ఫిలించాంబర్లదేనని, షూటింగ్స్ కు హాజరయ్యే కార్మికులకు పెంచిన జీతాలు చెల్లిస్తాం. జీతం ఎంత పెంచాలన్న దానిపై రేపు చర్చించి నిర్ణయిస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
ఈ విషయమై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛైర్మన్ సి కల్యాణ్ మాట్లాడుతూ..మంత్రి తలసాని శ్రీనివాస్ చొరవతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించాం. రేపటి నుంచి యదావిధిగా షూటింగ్స్ కొనసాగుతాయి. వేతనాల పెంపునకు దిల్రాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ శుక్రవారం సమావేశం అవుతుందని తెలిపారు.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!