సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు స్టేజిపై మాట్లాడుతున్నప్పుడు దర్శకులు, నిర్మాతలను పేరు పెట్టి సంబోధిస్తారు.. లేదంటే సార్ అని పిలుస్తారు. అంతే కానీ రిలేషన్తో మాత్రం అసలు పిలవరు. ఎంత క్లోజ్గా ఉన్న కూడా స్టేజ్పై పేరుతోనే పిలుస్తారు. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం దర్శకుడు వంశీ పైడిపల్లిని అన్నా అంటూ సంబోధించింది. ఆమె ఎవరో కాదు రష్మిక మందన్న. ప్రస్తుతం ఈమెకు సౌత్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. మాతృభాష కన్నడలో నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతుంది రష్మిక మందన. మరోవైపు తెలుగులో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక్కడ వరస సినిమాల్లో చేస్తుంది రష్మిక. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో ఈమె హీరోయిన్. దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా రష్మిక చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చింది రష్మిక. ఈ సినిమాలో ఈమె హీరోయిన్. షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా ప్లైట్ పట్టుకొని మరి ఈవెంట్కు వచ్చింది.
ఇక స్టేజి ఎక్కిన తర్వాత.. మైక్ చేతికి వచ్చిన తర్వాత రష్మిక మందన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈమె మాటలతో అక్కడున్న వాళ్లు విజిల్స్ వేస్తూ సపోర్ట్ చేశారు. ఈ ఈవెంట్కు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ముఖ్య అతిథిగా వచ్చాడు. గతంలో కార్తీతో ఉపిరి సినిమా చేశాడు వంశీ. అదే సాన్నిహిత్యంతో ఇప్పుడు సుల్తాన్ వేడుకకు వచ్చాడు ఈయన.
స్టేజ్ పై ఉన్న ఈయనను ఎంతో ఆప్యాయంగా వంశీ అన్న అంటూ రష్మిక మందన పిలిచింది. ఇది అక్కడ ఉన్న వాళ్లకు కాస్త షాకింగ్ అనిపించొచ్చు కానీ వంశీ పైడిపల్లి, రష్మిక మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో ఈ ఒక్క పిలుపుతో అర్థమైపోయింది. అంతే కాదు మహర్షి సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో పార్టీ కావాలి అంటూ అడిగింది.
ఏదేమైనా ఒక స్టార్ డైరెక్టర్ను హీరోయిన్ అన్నయ్య అని పిలవడం వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి కూడా హీరోలు దర్శకులు అందరినీ అన్నయ్యా అని పిలుస్తుంది. ఇది ఆనవాయితీ రష్మిక కూడా కొనసాగిస్తుందిప్పుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి