movie tickets | కొన్ని రోజులుగా సినిమా టికెట్లు పెంచుకుంటాం అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు థియేటర్ల యాజమాన్యాలు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దాంతో వాళ్లు ప్రయోజనం లేదని కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా ఈ విషయంలో ఆసక్తికరమైన తీర్పు వెలువరించింది తెలంగాణ హై కోర్టు. సినిమా టికెట్ల ధరల పెంచుకోవడానికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో థియేటర్ ఓనర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితుల కారణంగా టికెట్ల రేట్లు పెంచుకుంటామని థియేటర్ సంఘం ప్రభుత్వాన్ని తరచుగా అడుగుతూనే ఉన్నారు.
అఖండ, ట్రిపుల్, పుష్ప ఇలా రాబోయే నెల రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు చాలావరకు విడుదలవుతున్నాయి. వాటికి టికెట్ ధరలు పెంచుతామని థియేటర్ సంఘం హై కోర్టుకు విన్నవించుకుంది. ఒక్కో టికెట్పై రూ.50 పెంచేందుకు అనుమతి కోరాయి. ఈ మేరకు ప్రభుత్వం స్పందించడం లేదంటూ థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. దాంతో డిసెంబర్ 2న విడుదల కాబోయే అఖండ సినిమాకు టికెట్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిరంజీవి గాడ్ఫాదర్లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
Ruhani Sharma | చిలసౌ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ !
Akhanda Benefit shows | అఖండ బెనిఫిట్ షోకు గ్నీన్ సిగ్నల్..ఈ రెండు థియేటర్లలోనే..
Vicky katrina Wedding | విక్కీకౌశల్-కత్రినాకైఫ్ నిర్ణయంతో అప్సెట్ అవుతున్నారా..?