మిల్కీ బ్యూటీ తమన్నా గత కొద్ది సంవత్సరాలుగా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆచితూచి అడుగులు వేస్తూనే క్రేజీ ప్రాజెక్ట్స్ అందిపుచ్చుకుంటుంది. ఇటీవల వెబ్ సిరీస్లకు కూడా సైన్ చేస్తుంది. రీసెంట్గా రెండు వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా ఇప్పుడు మరో పాన్ ఇండియా ఆఫర్ అందుకుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమాలో నటించిన తమన్నా ఇప్పుడు యష్ సరసన మరో పాన్ ఇండియా మూవీలో నటించనుందని సమాచారం.
కేజీఎఫ్ 2 చిత్రం తర్వాత యష్ కన్నడ దర్శకుడు నార్తన్ తెరకెక్కించే భారీ యాక్షన్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఇది ఆర్మీ నేపథ్యంలో సాగే సినిమా. ఇందులో తమన్నా కథానాయికగా నటించనుంది. కేజీఎఫ్లో స్పెషల్ సాంగ్తో అలరించిన తమన్నా ఇప్పుడు యష్ సరసన కథానాయికగా నటిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావలసి ఉంది. కాగా, తమన్నా నటించిన సీటీమార్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం,ఎఫ్ 3చిత్రాలతో బిజీగా ఉంది.