రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన చరణ్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చిన గ్యాప్ను ఇప్పుడు భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దానికోసమే నచ్చిన కథలను లాక్ చేసుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. ఒకేసారి ముగ్గురు నలుగురు దర్శకులతో కమిట్ అయ్యేలా కనిపిస్తున్నాడు.
ఇప్పటికే ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ సినిమాతో బిజీ అయ్యాడు రామ్ చరణ్. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా ఉండబోతున్నది. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమా అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా మొదలయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమాతో పాటు మరో దర్శకుడిని కూడా లైన్లో పెట్టాడు మెగా పవర్ స్టార్. అతడే గౌతమ్ తిన్ననూరి. యువీ క్రియేషన్స్ బ్యానర్లో గౌతమ్ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్తో బిజీగా ఉన్నాడు గౌతమ్. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా మొదలు కానుంది. హైలీ ఎమోషనల్ స్టోరీగా ఇది తెరకెక్కబోతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర ఇది. ఈ సినిమా కోసం చరణ్ చాలా వేచి చూస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉండబోతుంది.
ఈ రెండు సినిమాలే కాకుండా మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సైతం రామ్ చరణ్ కు ఓ కథ చెప్పాడు. మాస్టర్ సినిమాను నిర్మించిన నిర్మాతలే రామ్ చరణ్ సినిమాను కూడా నిర్మించాలనుకున్నారు. అయితే ఈ కథ విషయంలో చరణ్ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అందుకే నో చెప్పాడు. అదే సినిమాను ఇప్పుడు సూర్య హీరోగా లోకేష్ చేయబోతున్నట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా తర్వాత సూర్యతో సినిమా చేయనున్నాడు ఈయన. మరి చూడాలి.. చరణ్ కాదన్న కథ సూర్యకు ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Bandla: ఎన్టీఆర్తో గొడవపై స్పందించిన బండ్ల గణేష్..!
హిమాలయాల్లో జ్యోతిక.. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు