AKhil Akkineni | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్లో మొదటి విజయం అందుకొన్నాడు అఖిల్ అక్కినేని. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా.. అఖిల్ కెరీర్కు కావాల్సిన బూస్టప్ ఇచ్చింది. దాంతో ఈ జోష్ కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు అఖిల్. అందుకే తర్వాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ ( Agent ) సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 40 శాతం పూర్తయింది. ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యాడు అఖిల్. హాలీవుడ్ హీరోలా మారిపోయాడు. 8 ప్యాక్ బాడీ కూడా చేశాడు. భారీ బడ్జెట్ తో ఏజెంట్ ( Agent ) సినిమా వస్తోంది. సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ లో కొంతమందికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా షూటింగ్ ఆపేశారు. మళ్ళీ ఎప్పటికి మొదలవుతుందో క్లారిటీ లేదు. ఈ గ్యాప్ లో ఇప్పటి వరకు చేసిన ఫుటేజ్ అంతా ఒకసారి చూసుకున్న తర్వాత.. కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాలని భావిస్తున్నాడు సురేందర్ రెడ్డి.
అనుకున్నట్లుగా సన్నివేశాలు రాకపోవడంతో టైమ్ తీసుకుని సినిమాకు రిపేర్లు చేయాలని చూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అంతెందుకు మొన్న సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమాకు కూడా కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేశారు. రీ షూట్ చేయడం అంటే ఈ సినిమాను ఇంకా బాగా సిద్ధం చేయడం అని నమ్ముతాడు నాగార్జున. అదే ఆయన వారసులు కూడా ఫాలో అవుతున్నారు. అందుకే అఖిల్ సినిమా విషయంలో మొదట్లోనే జాగ్రత్త పడుతున్నారు. 2022లోనే ఏజెంట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
Malli Modalaindi | OTTలో నేరుగా విడుదలవుతున్న సుమంత్ మళ్లీ మొదలైంది..