టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వస్తున్న ప్రాజెక్టు ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా..పూజాహెగ్డే ఫీ హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం రెగ్యులర్ షూటింగ్ ఇవాళ షురూ కావాల్సింది. కానీ తాజా వార్త ఏంటంటే..త్రివిక్రమ్ అండ్ టీం ఈ సినిమా ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ వర్క్ను సెప్టెంబర్ 12న అంటే సోమవారం నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించారట.
మొదట హీరోతోపాటు ఇతర యాక్టర్లపై వచ్చే ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ కూడా టీం అందించనుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2023 ఏప్రిల్ 28న గ్రాండ్గా విడుదల కానుంది. త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వీరిద్దరూ మూడో సినిమాతో వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ మూవీకి మహేశ్ బాబు ఇప్పటికే 100 డేస్ కాల్షీట్లు ఇచ్చేశాడని ఇన్ సైడ్ టాక్.సర్కారు వారి పాట తర్వాత ఎస్ థమన్ మ్యూజిక్ మరోసారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి పనిచేయబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు.
Read Also : Hari Hara Veera Mallu | క్రిష్ సినిమాపై ఫోకస్..డేట్స్ కూడా ఇచ్చేసిన పవన్..!