Rajamouli | ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli ).. మరో భారీ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నారు. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్ను ఆయన సమర్పించనున్నారు. ఇండియన్ సినిమా (Indian cinema) ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కథతో ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made in India) పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు నితిన్ కక్కర్ (Nitin Kakkar) దర్శకత్వం వహించనున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన చిత్రం రాజమౌళి సమర్పణలో రానుంది.
ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ‘మొదట ఈ కథ గురించి విన్నప్పుడు నేను చాలా భావోద్వేగాయానికి గురయ్యాను. బయోపిక్లను రూపొందించడం చాలా కష్టం. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్ అంటే అది సవాళ్లతో కూడుకున్నది. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
When I first heard the narration, it moved me emotionally like nothing else.
Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:)
With immense pride,
Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ— rajamouli ss (@ssrajamouli) September 19, 2023
Also Read..
Hero Navdeep | హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు
Vijay Antony | బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య
Khufiya Trailer | యాక్షన్ మోడ్లో టబు.. ఆసక్తికరంగా ‘ఖుఫియా’ ట్రైలర్