బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టును తెరకెక్కించి తెలుగు చలన చిత్ర పరిశ్రమను స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). మళ్లీ ఇపుడు బాహుబలిని మించి మరోసారి భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు జక్కన్న. మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది ఆర్ఆర్ఆర్ (RRR). ఈ చిత్రం రిలీజ్ కాకముందే జక్కన్న భారీ క్రేజీ అప్డేట్ లీక్ చేసి మూవీ లవర్స్ లో మరింత జోష్ నింపుతున్నాడు.
ఈ దర్శకుడు నెక్ట్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #SSMB29 (SSMB29)గా రాబోతున్న ఈ ప్రాజెక్టులో మహేశ్ లీడ్ రోల్లో నటించనుండగా..ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి చెప్పాడు రాజమౌళి. మా దగ్గర బేసిక్ స్టోరీ ఉంది. ఈ కథను పూర్తి స్థాయి కథగా డెవలప్ చేయాల్సి ఉందన్నాడు. అంతేకాదు ఈ చిత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్ కంటే భారీ స్థాయిలో ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు.
ఈ ప్రాజెక్టులో నందమూరి బాలకృష్ణ కూడా నటించబోతున్నాడన్న వార్తలపై స్పందిస్తూ.. మహేశ్బాబు ఒక్కడే మెయిన్ లీడ్ యాక్టర్ అని క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. మొత్తానికి ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత రాజమౌళి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మరో క్రేజీ ప్రాజెక్టుతో సినీ లవర్స్ ను ఊపిరాడనీయకుండా చేసేందుకు రెడీ అవుతుండటం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
మహేశ్ బాబుతో తెరకెక్కించనున్న చిత్రం ఆఫ్రికా అడవుల (African forests) బ్యాక్ డ్రాప్లో ఉంటుందని ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ లీక్ చేశారు. మరి సిల్వర్ స్క్రీన్పై మహేశ్ను ఎలా చూపిస్తాడోనని ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.