టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ సుకుమార్ (Sukumar), స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప..ది రైజ్ (Pushpa). కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika mandanna) హీరోయిన్గా నటించింది. పుష్పరాజ్, శ్రీవల్లి పాత్రల్లో అల్లు అర్జున్, రష్మిక జీవించేశారు. బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా ఇపుడు పుష్ప..ది రూల్పై అందరి ఫోకస్ పడింది. ఈ ప్రాజెక్టు ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా మరో అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. పుష్ప టీం షూటింగ్ ప్లాన్ ను మార్చేసిందట. ఏప్రిల్ నుంచి పుష్ప 2 చిత్రీకరణ మొదలుకానున్నట్టు ఇప్పటివరకున్న టాక్..కాగా ఏప్రిల్లో కాకుండా వేసవి చివరలో (మే నెల) లేదా జూన్ లోకానీ షురూ చేయాలని సుకుమార్ టీం భావిస్తున్నట్టు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. అంతేకాదు ముందుగా అనుకున్న విడుదల తేదీని డిసెంబర్ 2022 నుంచి మరో డేట్కు వాయిదా వేస్తారని టాక్ నడుస్తోంది.
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోండగా..షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్పై క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్. ఫస్ట్ పార్టులో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించగా..స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్లో మెరిసింది.
Read Also: Ramarao On Duty | రేపు 10 ఉదయం గంటలకు గెట్ రెడీ అంటోన్న రామారావు