ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ లవర్స్ టికెట్ల వేటలో మునిగిపోతున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మల్టీ స్టారర్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ టికెట్ల క్రేజీ ఎలా ఉందో తాజా అప్ డేట్ చెప్పేస్తుంది.
ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్లను నగరానికి చెందిన కొందరు పొలిటికల్ లీడర్లు (Hyd Political Leaders) ఆర్ఆర్ఆర్ టికెట్లను బల్క్గా కొనుగోలు చేసే పనిలో పడ్డారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఏపీలో ఇప్పటికే అధికారంలో ఉన్నవారే తమకు టికెట్లు కావాలని అఫీషియల్ లేఖలు రాస్తున్న వార్తలు తెరపైకి వచ్చాయి. సాధారణంగా రాజకీయవేత్తలు థియేటర్ల ఓనర్లను, ఫ్యాన్స్ అసోసియేషన్స్ ను టికెట్లను ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తుంటారు.
కానీ పొలిటీషియన్లు ఈ సారి మాత్రం రూట్ మార్చి ఇలా బల్క్లో టికెట్లు కొనడమేంటని తెగ చర్చ నడుస్తోంది. టాప్ క్లాస్ పొలిటీషియన్స్ తమ అనుచరులు, క్యాడర్ లో తమ గుడ్విల్ను పెంచుకోవడంలో భాగంగానే ఇలా ఆర్ఆర్ఆర్ టికెట్లను కొనుగోలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టికెట్ల ధరలు అధికంగా ఉన్నపుడు చాలా మంది వాటిని కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఇలాంటపుడు తమ అనుచరులకు టికెట్లు కొనిస్తే..ఇప్పించిన ఎప్పటికీ గుర్తుంచుకునే అవకాశం కూడా ఉంటుందని, తద్వారా తమ క్యాడర్ లో ఉత్సాహం కూడా నింపినట్టవుతుందని పొలిటీషియన్లు ఇలా చేస్తున్నారని ట్రేడ్ పండితులు అంటున్నారు.
మొత్తానికి ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఇలా పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి పొలిటీషియన్లు ఇలా బల్క్ గా టికెట్లు కొనే ట్రెండ్ షురూ అయిందంటే..ఇక మూవీ లవర్స్ కు టికెట్లకు దొరకడం కష్టమైనా ఆశ్చర్యపోనవసరం లేదన్నమాట.