‘మా’ ఎన్నికల (Maa Elections) తర్వాత ప్రకాశ్రాజ్ (Prakash Raj) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ప్యానెల్ సభ్యులు మాట్లాడిన మాటలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. మా ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయే వరకు రౌడీయిజం చేశారని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ప్రెస్ మీట్లో ఎవరెవరు ఏమన్నారో క్లుప్తంగా..
ప్రకాశ్రాజ్ (Prakash Raj) :
‘మా’లో ఆత్మ..పరమాత్మ..ప్రేతాత్మలు లేవు. ఏ అసోసియేషన్ పెట్టే ఉద్దేశం లేదు. మాలో కొనసాగుతాం..మాలోనే ఉండి విష్ణు ప్యానెల్ను ప్రశ్నిస్తాం. ప్రతీ నెలా రిపోర్టు కార్డు అడుగుతా..నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా.
శ్రీకాంత్ (Sreekanth) :
‘మా’లో రెండు వర్గాలకు చెందిన వాళ్లుంటే విబేధాలు వస్తాయని, అభివృద్ది జరుగదని శ్రీకాంత్ అన్నారు. గతంలో రెండు ప్యానెళ్ల సభ్యులుండటం వల్ల అభివృద్ధి జరుగలేదు. మేమంతా ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్లం. మేం ప్రశ్నిస్తే గొడవలు వస్తాయి. విష్ణు మేనిఫెస్టో అమలు చేస్తాడని నమ్మకముంది. ఏకాభిప్రాయం లేకపోతే కలిసి పనిచేయడం కష్టం. విష్ణు నాకు తమ్ముడు లాంటి వాడని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
ఉత్తేజ్ (Uttej) :
సినిమా అన్న పదమే లోకల్ కాదు. లోకల్, నాన్ లోకల్ అనే పదాన్ని తీసుకొచ్చారు. గతం నుంచి నరేశ్ తీరు సరిగా లేదు. ఎప్పటి నుంచో మాలో వేర్పాటు ఉంది. మా అమ్మను కించపరిచేలా బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తేజ్.
బెనర్జీ (Benerjee) :
‘మా’ ఎన్నికల పోలింగ్ సమయంలో మోహన్బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు. ఆయన ప్రవర్తనతో చాలా బాధపడ్డా. రాజీనామా చేసిన తర్వాత నాకు భారం తగ్గింది. విష్ణు బాగా పనిచేస్తాడని నమ్ముతున్నా.
తనీష్ (Tanish) :
మోహన్బాబు నన్ను ఎందుకు తిట్టారో అర్థం కాలేదు. మా అమ్మను కించపరిచేలా బూతులు తిట్టారు. ఈ భయానికి మా అభిప్రాయాలు చెప్పలేమోమో.
ఇది కూడా చూడండి
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ