అగర్తలా: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వైరస్ బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. తనకు కరోనా సోకిందని సీఎం స్వయంగా వెల్లడించారు. ‘నాకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1,15,736 మందికి కరోనా బారినపడ్డారు. దీంతో మొత్ కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. ఇప్పటివరకు 1,66,177 మంది మరణించారు. త్రిపురలో తాజాగా 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 33,575కు చేరాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..