కొత్త కొత్త కాన్సెప్ట్తో సినిమాలు చేసే యాక్టర్లలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు (Tollywood) యువ హీరో శర్వానంద్ (Sharwanand). శర్వానంద్ , సిద్దార్థ్ (Siddharth) హీరోలుగా వచ్చిన సినిమా మహాసముద్రం (mahasamudram). అనూ ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హీరోయిన్లుగా నటించారు. అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వం వహించాడు. శర్వానంద్ కొన్నిసార్లు కథల ఎంపికలో తప్పటడుగు వేస్తాడన్న టాక్ కూడా ఉంది. ఈ సినిమాతో ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొందరు ట్రేడ్ పండితులు.
శర్వానంద్ ట్రాక్ రికార్డు చూస్తే కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లో వచ్చే సినిమాలు అతనికి సరిగ్గా సెట్ అవుతాయి. సీరియస్ కథాంశాలు అంతగా వర్కవుట్ కావు. శర్వానంద్ గెటప్ విషయంలో కాని, ముఖ హావభావాలను పలికించడంలో కానీ ప్రతీ సినిమాలో దాదాపు ఒకేలా కనిపిస్తుంటాడు. డిఫరెంట్ జోనర్ లో వచ్చిన జాను, మహాసముద్రం చిత్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అయితే శర్వానంద్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభావం నిర్మాతల మీద కూడా పడుతుందట. గతంలో మూడు తప్పులు చేసిన శర్వానంద్..ఇపుడు నాలుగోది కూడా చేశాడని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.
గతంలో రణరంగం చిత్రానికి నిర్మాత నాగవంశీకి రూ.8 కోట్లు నష్టం వచ్చింది. ఆ తర్వాత పడి పడి లేచె మనసు సినిమాకు నిర్మాత సుధాకర్ రూ.10 కోట్ల నష్టాన్ని చవిచూశారు. శ్రీకారం చిత్రాన్ని నిర్మించిన రామ్ ఆచంట రూ.8 కోట్ల నష్టం మూటగట్టుకున్నాడు. తాజాగా మహాసముద్రం ఆశించిన స్థాయిలో ముందుకెళ్లకపోవడంతో మరి ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకరకు ఏ స్థాయిలో నష్టాలను తెచ్చిపోతుందోనని అంచనాలు వేసుకుంటున్నారు సినీ జనాలు.
ఇది కూడా చూడండి
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి