టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం తన ఫోకస్ అంతా (Shankar) డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 15 (RC15) పైనే పెట్టాడు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఓ ఆసక్తికర అప్ డేట్ ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది. శంకర్ ఓ పాట, ఫైట్ చిత్రీకరణ కోసం రూ.20 కోట్లు ఖర్చుపెట్టాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సర్కారోడు వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ పాటను రామోజీఫిలింసిటీలో షూట్ చేయగా..దీనిపై రూ.9కోట్లు ఖర్చుపెట్టాడట శంకర్.
అంతేకాదు వేరే రాష్ట్రంలో ఓ ఫైట్ సన్నివేశం కోసం శంకర్ రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్టు టాక్. ఎలాంటి వీఎఫ్ఎక్స్, సీజీ, గ్రీన్ మ్యాట్స్ అందుబాటులో లేనపుడు ఫైట్స్, పాటలను అద్బుతంగా డిజైన్ చేసిన శంకర్..ఈ సారి మాత్రం రాంచరణ్ కోసం భారీ మొత్తంలో ఖర్చుపెడుతూ కలర్ఫుల్గా వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని తాజా అప్ డేట్తో తెలిసిపోతుంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani)హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రంలో రాంచరణ్ రెండు గెటప్స్ లో కనిపించనున్నాడట. స్టూడెంట్గా, ప్రభుత్వ ఉద్యోగిగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు ఇన్సైడ్టాక్. రాంచరణ్ స్టూడెంట్ లైఫ్కు సంబంధించిన సీన్ల చిత్రీకరణ కోసం శంకర్ టీం అమృత్సర్ లొకేషన్ను ఫైనల్ చేసిందట. త్వరలోనే ఈ లొకేషన్లో షూట్ మొదలు పెట్టనున్నారు. షూటింగ్ కోసం మరోవైపు వైజాగ్లో కూడా హీరో ఇంటి సెట్ను ఏర్పాటు చేశారు. రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.