రామ్ చరణ్ (Ramcharan), శంకర్ (Shankar) సినిమా అత్యంత వైభవంగా చిరంజీవి (Chiranjeevi), రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హైదరాబాద్ లో మొదలైంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు తన ప్రొడక్షన్ హౌస్ లో 50వ సినిమాగా RC 15 (Ramcharan 15) నిర్మిస్తున్నాడు. నిజానికి భారతీయుడు-2 సినిమాను దిల్ రాజు నిర్మించాలి. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే బడ్జెట్ విషయంలో తేడా వచ్చి తప్పుకున్నాడు ఈ నిర్మాత. మళ్లీ ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో తన సినిమా చేస్తున్నాడు దర్శకుడు శంకర్. రామ్ చరణ్ ఇమేజ్ కి తగ్గట్లు అద్భుతమైన పొలిటికల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు శంకర్. కొందరు ఈ సినిమా ఒకే ఒక్కడు సీక్వెల్ అంటున్నారు. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఏమీ మాట్లాడడం లేదు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అంటూ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా కోసం 250 కోట్ల బడ్జెట్ దిల్ రాజు కేటాయించినట్లు తెలుస్తోంది. దానికి మించకుండా సినిమా ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు శంకర్ కు నిర్మాత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శంకర్ కూడా బడ్జెట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నాడు.
తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ కోసం కోసం ఏకంగా కోటి 73 లక్షల ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పోస్టర్ లో సినిమాకి పనిచేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉన్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు శ్రీకాంత్, సునీల్, జయరామ్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
కేవలం కాన్సెప్ట్ పోస్టర్ కోసమే 1.73 కోట్లు ఖర్చు పెట్టేస్తే.. సినిమా అంతా తీయడానికి శంకర్ ఎంత బడ్జెట్ పెట్టిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 2.0 సినిమా విషయంలోనే నిర్మాతలతో శంకర్ కు బడ్జెట్ గొడవలు జరిగాయి. ఆ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత భారతీయుడు 2 సినిమా మధ్యలోనే ఆపేశాడు ఈయన. అది కూడా కేవలం బడ్జెట్ కష్టాలతో ఆగిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం భారీ బడ్జెట్ ప్లాన్ చేసాడు శంకర్. మరి చూడాలి చివరి వరకు ఈ సినిమా బడ్జెట్ ఎంతవుతుందో..?
Sunny Leone| సన్నీలియోన్ అందాలకు గులామ్ అవ్వాల్సిందే..వీడియో
Sanjay Dutt: సౌత్లోను బిజీ అవుతున్న సంజయ్ దత్