పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్, రాయస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ తన ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవన్ను ప్రకటించాడు. తన జట్టులో భారత్ నుంచి ధోనీ, కోహ్లీ, శర్మలకు చోటు కల్పించాడు. సురేశ్ రైనా, గేల్, శిఖర్ దావన్, డేవిడ్ వార్నర్లను ఎంపిక చేయలేదు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్.. ఐపీఎల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఐపీఎల్ పోటీలను సస్పెండ్ చేసిన తర్వాత బట్లర్ క్రిక్బజ్ ప్లస్తో ముచ్చటిస్తూ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ను వెల్లడించాడు.
రోహిత్ తో కలిసి తనను ఓపెనర్గా పేర్కొన్న బట్లర్.. మిగిలిన బ్యాటింగ్ లైనప్లో కోహ్లీ, ధోనీలను తీసుకున్నారు. ఇద్దరు ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, కీరోన్ పొలార్డ్ పేర్లను తీసుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే హర్బజన్సింగ్, భువి, బుమ్రా, మలింగలకు చోటు కల్పించారు.
జోస్ బట్లర్ ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), కీరోన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.
గవర్నర్ను మార్చండి : రాష్ట్రపతి, ప్రధానికి మమత లేఖ
కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ
బైడెన్ కన్నా కమలా సంపాదన ఎక్కువ.. ఎంత పన్ను చెల్లిస్తున్నారంటే..?!
టీకా దౌత్యానికి భారత్, దక్షిణాఫ్రికాకు చైనా మద్దతు
ఇక న్యూయార్క్లో దీపావళి సెలవుదినం..?
వచ్చే నవంబర్లో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన
ముగిసిన ఎల్టీటీఈ శకం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..