బీజింగ్ : కరోనా టీకాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి సేందుకు వాటిపై ఉన్న వాణిజ్య సంబంధ మేధో సంపత్తి చట్టాన్ని సడలించాలని చైనా కూడా కోరుకుంటున్నది. ఈ విషయంలో భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనలకు మద్దతు ఇస్తామని చైనా తెలిపింది. పేద దేశాల కోసం టీకాను విస్తృతంగా ఉత్పత్తి చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వద్ద ప్రతిపాదించడం ద్వారా ఇరు దేశాలు ఈ చట్టాన్ని సడలించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఇరు దేశాల డిమాండ్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మద్దతు తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేది భారత్ మరియు దక్షిణాఫ్రికా. కరోనా ఇన్ఫెక్షన్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నదని భారత్, దక్షిణాఫ్రికాలు డిమాండ్ చేస్తున్నాయి. పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్ అందించడానికి పెద్ద ఎత్తున టీకాల ఉత్పత్తి అవసరం. ఈ వాస్తవికతను గ్రహించి ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశాల రాయబారుల సమావేశంలో మేధో సంపత్తి చట్టం సడలింపును పునః పరిశీలించారు. దీనికి సంబంధించి 2020 అక్టోబర్లో భారత్, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనపై అమెరికా, యూరోపియన్ యూనియన్ల మద్దతు పెరుగుతోంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను చైనా బాగా అర్థం చేసుకుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. అందువల్ల, వాణిజ్య సంస్థలో భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు తాము మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి పేద దేశాలకు పంపిణి చేపట్టాలన్న ఈ రెండు దేశాల అభ్యర్థన చాలా విలువైనదని కొనియాడారు.
ఇక న్యూయార్క్లో దీపావళి సెలవుదినం..?
వచ్చే నవంబర్లో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన
ముగిసిన ఎల్టీటీఈ శకం.. చరిత్రలో ఈరోజు
నితీష్జీ.. నా కోసం పెండ్లిళ్లపై నిషేధం విధించరూ..?!
కరోనా ముప్పు దృష్ట్యా పాఠశాలల మూసివేతకు నిర్ణయం
ప్రయాణ పరిమితులను తొలగించిన సౌదీ అరేబియా
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..